అళియ రామ రాయలు
వికీపీడియా నుండి
రామ రాయలు (Rama Raya) శ్రీ కృష్ణదేవ రాయలు అల్లుడు, గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, చాలా కాలం 16వ శతాబ్ది రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించినాడు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున ఈయనను అళియ రామరాయలు (కన్నడములో అళియ అంటే అల్లుడు) అని కూడా వ్యవహరిస్తారు.
ఇతని కాలమున నలుగురు సుల్తానులు దక్కనును పరిపాలించేవారు
- బీజాపూరు సుల్తాను ఇబ్రహీం ఆదిల్షా
- అహ్మద్నగర్ సుల్తాను బురహాన్ నిజాం షా
- గోల్కొండ సుల్తాను జంషీద్ కులీ కుతుబ్ షా
- బీదరు సుల్తాను అలీ బరీదు
వీరిలో వీరు కలహించుకుంటూ ఉండేవారు, దానిని అలుసుగా తీసుకొని రామరాయలు ఒకసారి ఒకరికి, మరొకసారి మరొకరికీ సహాయం చేస్తూ చక్కగా ధనం సంపాదించినాడు. చివరకు ఇదే ఇతని మరణానికి, విజయనగర సామ్రాజ్యం పతనానికి దారితీసినది.
- 1543లో అహ్మద్నగర్, గోల్కొండ సుల్తానులతో కలసి బీజాపూరు సుల్తానుపైకి దండెత్తినాడు.
- 1544లో అహ్మద్నగర్ రాజునకు సహకరించినాడు.
ఇతను సైన్యంన ముస్లింలను చాలా మందిని చేరుకున్నాడు.
గోల్కొండ నవాబు అయిన జంషీద్ కులీ కుతుబ్ షా చివరి తమ్ముడు అయిన ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి ఏడు సంవత్సరములు ఆశ్రయమిచ్చి తరువాత జాగీరు కూడా ఇచ్చినాడు.
1551 లో రామరాయలూ, అహ్మద్నగర్ సుల్తానూ బీజాపూరు పైకి దండయాత్ర చేసి రాయచూరు, ముద్గల్లు, కృష్ణా, తుంగ భద్రా నదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
1553లో ఏడు లక్షల ధనమును స్వీకరించి బీజాపూరు సుల్తానును అహ్మద్నగర్ సుల్తాను అయిన హుసేన్ నిజాం షా నుండి కాపాడినాడు.
తరువాత 1557లో బీజాపూరు సుల్తానునకు సహాయం చేసి హుసేన్ నిజాం షా తో యుద్దం చేసెను, ఈ దండయాత్రలో విజయనగర సైనికులు దౌలతాబాదు వరకూ గల విశాల భూభాగాలను జయించి అనేక మసీదులనూ, ఖురానులకూ అవమానం చేసినారు. దీనితో నలుగురు సుల్తానులూ ఒక్కటి అవ్వడానికి అవకాశం ఏరడినది. ఈ దుశ్చర్యలకు ముఖ్యముగా గోల్కొండ నవాబు ఇబ్రహీం కులీ కుతుబ్ షా బాధపడినాడు.
[మార్చు] తళ్ళికోట యుద్ధము
- ప్రధాన వ్యాసము: తళ్ళికోట యుద్ధము
1564 డిసెంబర్ 25 న నలుగురు సుల్తానులూ ఏకమై తళ్ళికోట వద్ద యుద్దమునకు సిద్దమయినారు. 1565 జనవరి 23 న జరిగిన తళ్ళికోట యుద్దములో రామ రాయలు శత్రువుల చేతిలో మరణించినాడు. దీనితో శతాబ్దాల విజయనగర వైభవం క్షిణించినది. కేవలం వీరి యుద్ద శిభిరాలనుండే కోటింపాతిక ధనమును పొందినారు, తరువాత విజయనగర ప్రజలు అడవులబట్టిపోయినారు, ఆరునెలలు నలుగురు సుల్తానులు విజయనగరంలోనే మకాం వేసి తరువాత వారిలో వారికి గొడవలు వచ్చి ఎవరి రాజ్యానికి వారు పొయినారు.
విజయనగర రాజులు | |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: సదాశివ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1542 — 1565 |
తరువాత వచ్చినవారు: తిరుమల దేవ రాయలు |