హిమాచల్ ప్రదేశ్
వికీపీడియా నుండి
హిమాచల్ ప్రదేశ్ | |
రాజధాని - Coordinates |
షిమ్లా - |
పెద్ద నగరము | షిమ్లా |
జనాభా (2001) - జనసాంద్రత |
6,077,248 (20th) - 109/చ.కి.మీ |
విస్తీర్ణము - జిల్లాలు |
55,673 చ.కి.మీ (17th) - 12 |
సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1971-01-25 - విష్ణు సదాశివ్ కోక్జె - వీరభద్ర సింగ్ - Unicameral (68) |
అధికార బాష (లు) | హిందీ మరియు పహారీ |
పొడిపదం (ISO) | IN-HP |
వెబ్సైటు: himachal.nic.in |
హిమాచల్ ప్రదేశ్ (हिमाचल प्रदेश) వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి తూర్పున టిబెట్ (చైనా), ఉత్తరాన మరియు వాయువ్యమున జమ్మూ మరియు కాశ్మీరు, నైఋతిన పంజాబ్, దక్షిణాన హర్యానా మరియు ఉత్తర్ ప్రదేశ్ మరియు ఆగ్నేయమున ఉత్తారంచల్ రాష్ట్రములు సరిహద్దులుగా కలవు.
హిమాచల్ ప్రదేశ్ యొక్క విస్తీర్ణము 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు) మరియు 1991 జనాభా ప్రకారము రాష్ట్రము యొక్క జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించినది.
రాష్ట్ర రాజధాని షిమ్లా. ధర్మశాల, కాంగ్ర, మండి, కుల్లు, చంబా, డల్హౌసీ మరియు మనాలీ ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రములో చాలామటుకు ప్రాంతము పర్వతమయము. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతశ్రేణులు కలవు. శివాలిక్ శ్రేణి ఘగ్గర్ నది జన్మస్థలము. రాష్ట్రములోని ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉన్నది) మరియు బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.
విషయ సూచిక |
[మార్చు] జిల్లాలు
- కాంగ్రా
- హమీర్పూర్
- మండి
- బిలాస్పూర్
- ఊనా
- చంబా
- లాహుల్ మరియు స్పీతీ
- సిర్మార్
- కిన్నర్
- కుల్లు
- సొలాన్
- షిమ్లా
[మార్చు] సంస్కృతి
కాంగ్రి, పహారీ, పంజాబీ, హిందీ మరియు మండియాలీ రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే బాషలు. హిందూ మతము, బౌద్ధ మతము మరియు సిక్కు మతము రాష్ట్రములోని ప్రధాన మతములు. రాష్ట్రములోని పశ్చిమ భాగములోని ధర్మశాల, దలైలామా మరియు అనేక టిబెట్ శరణార్ధులకు ఆవాసము.
[మార్చు] రాజకీయాలు
2003 రాష్ట్ర శాసనసభలో భారత జాతీయ కాంగ్రేసు అధికారములోకి వచ్చినది. భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షము.
[మార్చు] రవాణా మరియు సమాచార ప్రసరణ
రోడ్లు ప్రధాన రవాణా మార్గములు. రోడ్లు కురుచగా మెలికలు తిర్గుతూ తరచూ ఊచకోతలు, భూమి జారడాల మధ్య ఉండటము వలన ప్రయాణము మెళ్లిగా సాగుతుంది. ఋతుపవనాల కాలములో పరిస్థితి మరింత భయానకము అవుతుంది. ప్రభుత్వము యాజమాన్యములో నడుస్తున్న హిమాచల్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ రాష్ట్రమంతటా బస్సులు నడుపుతుంది. దాదాపు అన్ని ప్రాంతాలకు టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్ సౌకర్యములు కలవు.
[మార్చు] మూలములు
- వర్మ, వి. 1996. గద్దీస్ ఆఫ్ ధౌళాధర్: ఏ ట్రాన్స్ హ్యూమన్ ట్రైబ్ ఆఫ్ ద హిమాలయాస్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ.
- హందా, ఓ. సీ. 1987. బుద్ధిష్ట్ మొనాస్టరీస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ. ISBN 81-85182-03-5.
[మార్చు] బయటి లింకులు
- హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైటు
- హిమాచల్ ప్రదేశ్ గురించిన వెబ్సైటు
- హిమాచల్ ప్రదేశ్ - కళలు, సంస్కృతి పోర్టల్
- హిమాచల్ ప్రదేశ్ గైడు
- హిమాచల్ ప్రదేశ్ గురించి వార్తలు
- ధర్మశాల.నెట్ - ధర్మశాల గురించిన సమాచారము
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | ![]() |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అస్సాం | బీహార్ | చత్తీస్గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ మరియు కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్, నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్, డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |