రంగనాయకమ్మ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ముప్పాళ్ల రంగనాయకమ్మ సుప్రసిద్ధ స్త్రీవాద, హేతువాద రచయిత్రి. ఈమె వ్రాసిన నవల 'జానకి విముక్తి' ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా వస్తూ ఉన్న రోజుల్లోనే వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ఆగి పోయింది. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన 'రామాయణ కల్పవృక్షం' ని తీవ్రంగా విమర్శిస్తూ 'రామాయణ విషవృక్షం' వ్రాసింది. ఆధునిక తెలుగు సాహిత్యం లో తీవ్ర సంచలనం కలిగించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల 'తులసీదళం' ని విమర్శిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వ్రాసింది. వాటిలో యండమూరి తో బాటు ఆ నవలకు ముందుమాట వ్రాసిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు ను కూడా విమర్శించడం వల్ల ఆయన పరువు నష్టం దావా వేసి గెలిచాడు.
ఆమె ఆవేశం, ఆమె భావాల్లోని స్పష్టత పాఠకులను ఆశ్చర్యపరుస్తాయి. అద్భుతమైన భావ వ్యక్తీకరణతో, అంతర్లీనంగా వినిపించే ఆవేశంతో, కడుపుబ్బ నవ్వించే హాస్య చతురతతో ఆమె వ్రాసిన మంచి నవల స్వీట్ హోం.
రంగనాయకమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామములో 1939 లో జన్మించింది. ఈమె తాడేపల్లిగూడెం లో ఉన్నత పాఠశాలలో చదివి 1955 లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యింది. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని కళాశాలకు పంపించి చదివించలేని కారణముగా ఈమె విధ్యాభ్యాసము అంతటితో ఆగిపోయినది.
రంగనాయకమ్మ 1958లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నది. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970 లో ఆ వివాహము నుండి బయటపడినది. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నది.
[మార్చు] నవలలు
జానకి విముక్తి
రచయత్రి
బలిపీఠం
క్రిష్ణవేణి
పేకమేడలు
కూలినగోడలు
స్త్రీ
ఇదే నా న్యాయం
చదువుకున్న కమల
కల ఎందుకు
స్వీట్ హోం
అంధకారంలొ