Wikipedia:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 2
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1976: భారత రాజ్యాంగం యొక్క 42 వ సవరణను లోక్సభ ఆమోదించింది. అప్పటివరకు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత్, ఈ సవరణ తరువాత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమయింది.
- 1774: రాబర్ట్ క్లైవ్ ఇంగ్లండ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారత్లో పనిచేసిన క్లైవు, కంపెనీ భారత్లో సాగించిన ఆక్రమణలలో ముఖ్య భూమిక నిర్వహించాడు. 1757లో జరిగిన, ప్రసిద్ధి చెందిన ప్లాసీ యుద్ధం లో బ్రిటిషు సేనాధిపతి ఈయనే. అప్పుల బాధ తట్టుకోలేక అత్మహత్యకు పాల్పడ్డాడు.