Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 12
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1967: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రామమనోహర్ లోహియా మరణం. భారతదేశంలోని ఇప్పటి సోషలిస్టులకు ఆదిగురువు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా రేడియో స్టేషను పెట్టాడు.
- 1998: ఢిల్లీ ముఖ్యమంత్రి గా సుష్మా స్వరాజ్ ప్రమాణ స్వీకారం.
- 1999: ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరిన రోజుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
- 2000: జే ఎం ఎం ముడుపుల కేసులో పూర్వపు ప్రధానమంత్రి పి వి నరసింహారావుకు, బూటాసింగుకు కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగారం, 2 లక్షల జరిమానా విధించింది.